ఢిల్లీ( Delhi Blast) ఎర్రకోట సమీపంలోని చాందినీ చౌక్లో(Chandni Chowk) జరిగిన భయానక కార్ బ్లాస్ట్కు ఇప్పటికీ ప్రతిధ్వనులు ఆగడం లేదు. ఈ పేలుడు జరిగిన దానికి కేవలం వారం రోజులే అయినా, దాని తీవ్రత, విధ్వంసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు, పది కార్లు నాశనం కాగా, డజన్లాది శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. ఈ మధ్యనే నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన పేలుడు కూడా ఇదే తరహా లక్షణాలతో ఉండటంతో, రెండు ఘటనలకు ఒకే రకం పేలుడు పదార్థం ఉపయోగించి ఉండొచ్చని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు.
Read also:Tollywood: టాలీవుడ్ తాజా అప్డేట్స్

ఇప్పటి వరకు IEDతోపాటు అమ్మోనియం నైట్రేట్ వాడారని తెలిసింది. కాని, విచారణలో మరో అత్యంత ప్రమాదకరమైన అంశం బయటపడింది—అదే TATP, దీనినే ప్రపంచవ్యాప్తంగా “మదర్ ఆఫ్ సైతాన్” అని పిలుస్తారు.
TATP – ప్రపంచం భయపడే పేలుడు పదార్థం
TATP అంటే ట్రై-అసెటోన్ ట్రై-పెరాక్సైడ్. ఇది కొద్దిపాటి ఉష్ణోగ్రత, ఘర్షణ లేదా ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ వల్లే భారీగా పేలిపోగల అత్యంత సున్నితమైన రసాయనం. దీన్ని తయారు చేయడమే ప్రమాదకరం, రవాణా చేయడం అంతకంటే రిస్కీ. ఫోరెన్సిక్ బృందాలు IEDలో 3 కిలోల అమ్మోనియం నైట్రేట్తో పాటు పెట్రోల్, డీజిల్, అలాగే TATP కూడా ఉన్నట్టు గుర్తించాయి. ఈ కాంబినేషన్తో బాంబు బరువు సుమారు 50 కిలోల వరకు ఉండొచ్చని అంచనా. TATP ప్రభావం TNT శక్తిలో 80% వరకు ఉంటుందని చెప్పబడుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు వీలైనంత విధ్వంసం కలిగించేందుకు ఈ పేలుడు పదార్థాన్నే ఎక్కువగా వాడుతుంటారు.
గతంలో జరిగిన TATP దాడులు
అమెరికాలో 2001లో జరిగిన షూ-బాంబర్ దాడి, 2005లో లండన్ బాంబింగ్, 2015లో పారిస్ సీరియల్ బ్లాస్టులు, 2016లో బ్రస్సెల్స్ పేలుళ్లు, 2017 మాంచెస్టర్ దాడి—ఇవన్నీ TATP ఆధారిత బాంబులతో జరిగిన ఘటనలే. ఇప్పుడు ఢిల్లీ పేలుళ్లలో( Delhi Blast) కూడా ఇదే పదార్థం వాడారా? జైషే ఉగ్రవాద కీలక నేతల ప్రమేయంుందా? అన్న విషయాలపై ఫోరెన్సిక్ నిపుణులు ఇంకా లోతుగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడే అవకాశముంది.
ఢిల్లీలోని కార్ బ్లాస్ట్కు కారణం ఏమిటి?
ప్రాథమికంగా IED అని తెలిసినప్పటికీ, ఇప్పుడు TATP వాడిన అవకాశాలు బయటపడుతున్నాయి.
TATP ఎందుకు ప్రమాదకరం?
చిన్నపాటి వేడి, ఘర్షణ, కరెంట్ షాక్తోనే పేలిపోగలదు; ప్రభావం TNTకు సమానం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: