మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని కొత్త మోసాలకు తెరలేపుతున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయిపోయింది. (Cyber crimes) ఏ పని చేయాలన్నా ఆన్లైన్లోనే జరిగిపోతోంది. దీన్నే సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. అమాయకులను, డిజిటల్ అక్షరాస్యత లేనివాళ్లను టార్గెట్ చేస్తున్నారు. వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలను కొల్లగొడుతూ అందిన కాడికి దోచేస్తున్నారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో సరికొత్త మార్గాల్లో మోసాలకు తెరలేపుతున్నారు.
Read Also: Bangladesh Crisis: భారత దౌత్యవేత్తల కుటుంబాల రప్పింపుపై కేంద్ర నిర్ణయం
కొత్త తరహా మోసాలు
ప్రస్తుతం మనుషుల ఎమోషన్ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇతరులు ఆపదలో ఉన్నారని, నిస్సహాయ స్థితిలో ఉన్నారని నమ్మబలుకుతూ అందిన కాడికి వసూలు చేస్తున్నారు. (Cyber crimes) సైబర్ కేటుగాళ్లు ‘మీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పలానా రాష్ట్రంలో చిక్కుకుంది’ అని చెబుతారు. అంతేకాకుండా ఆమె బ్యాగులన్నీ చోరీకి గురయ్యాయని.. ఆమె దగ్గర డబ్బులు లేవని నమ్మిస్తారు. ఈ క్రమంలో తమని జర్నలిస్టులుగా, స్థానిక అధికారులుగా ప్రచారం చేసుకుంటారు. ఇక అవతలి వ్యక్తికి నమ్మకం కలిగించాక ఎమోషనల్గా ట్రిగ్గర్ చేస్తారు.
అందులో భాగంగా కొన్ని రోజులుగా పలానా మహిళ రైల్వేస్టేషన్లోనో, బస్ట్ స్టేషన్ ప్లాట్ఫారంపై ఉంటున్నారని చెబుతారు. తానే స్వయంగా భోజనాలు పెట్టించానని అంటారు. అయితే తాను సామాన్యుడినని ఆ మహిళను స్వగ్రామానికి పంపించాలంటే తన దగ్గర డబ్బులు లేవు అని చెబుతారు. మీరు మీ ప్రాంతంలోని అధికారులు, నాయకులకు చెప్పి ఆర్థికసాయం అందేలా చూడండి అంటూ నమ్మిస్తారు. ఇలాంటి కొత్త తరహా మోసాలు ఏపీలోని పలు జిల్లాల్లో నమోదవుతున్నాయి. వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ జిల్లాల్లో కొంతమంది జిల్లా అధికారులు, విలేకర్లకు సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి ఇలా డబ్బులు అడుగుతున్నారట. ఇది నిజమేనని నమ్మి ఒకరిద్దరు డబ్బులు కూడా పంపించారని తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: