సిమ్ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై(Cyber Crime) సీఐడీ అధికారులు పట్టుకున్నారు. అంతర్జాతీయ ఫోన్ కాల్ లను లోకల్ కాల్ లుగా మార్చి భారీ స్థాయిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక ముఠాలను సీఐడీ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో ఒక వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Telangana: చిన్నమ్మతో సహజీవనం.. అన్న ప్రాణాలు తీసిన తమ్ముడు
‘సిమ్ బాక్స్’ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి అంతర్జాతీయ కాల్ లను స్థానిక కాల్ గా రూటింగ్ చేస్తూ టెలికాం వ్యవస్థకు భారీ నష్టం కలిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ముఠా చైనా వంటి దేశాల నుంచి సిమ్ బాక్స్ లను అక్రమంగా దిగుమతి చేసుకొని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ మోసాలకు పాల్పడినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోనే సుమారు 20కోట్ల రూపాయల వరకు మోసాలు
ఈ సైబర్ నేరగాళ్లు(Cyber Crime) కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే సుమారు 20కోట్ల రూపాయల వరకు మోసాలు చేసినట్లు సీఐడీ పేర్కొంది. అంతేకాకుండా, వీరు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు సమాచారం. కొత్త సిమ్ కార్డ్ తీసుకునే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు పోలీసులు సూచించారు. అనుమానాస్పద కాల్స్, విదేశీ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లేదా మోసపూరిత సమాచారం కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని, లేదా 1930 హెల్ప్ లైన్ నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: