చట్టాలు కఠినతరం అవుతున్నా, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు. అలాంటి ఘోర ఘటన నంద్యాల జిల్లా (Nandyal District) బనగానపల్లె మండలంలోని కైప గ్రామంలో వెలుగులోకి వచ్చింది.పదో తరగతి చదువుతున్న కేవలం 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు మనోహర్ (21) దారుణానికి పాల్పడ్డాడు. రోజు ఇంటి దగ్గర తిరుగుతున్న బాలికను మాయమాటలు చెప్పి తనవైపు తిప్పుకున్నాడు. మొదట స్నేహం పేరుతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత తన మాటలతో మభ్యపెట్టి ఇంట్లోకి తీసుకువెళ్లి, ఏడాది కాలంగా నిరంతరం అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు.

యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
అయితే కూతురుకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి (Banaganapalle Government Hospital) కి తరలించారు. డాక్టర్లు బాలికకు వైద్య పరీక్షలు చేసి, గర్భవతి అని నిర్ధారించారు. తొమ్మిది నెలల తర్వాత బాలికకు డెలివరి చేయడంతో మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబసభ్యులు నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సంఘటన మరోసారి సమాజానికి గట్టిగా హెచ్చరికగా మారింది. చట్టాలు ఎంత కఠినమైనా, మనస్తత్వం మారకపోతే మహిళలపై, పిల్లలపై అఘాయిత్యాలు ఆగవు. తల్లిదండ్రులు పిల్లలతో మరింతగా సమయం గడిపి, వారికి భద్రతా జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: