📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Telugu News: Crime:యువకుడి హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

Author Icon By Sushmitha
Updated: September 27, 2025 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నల్లగొండ: కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో ఇద్దరు పాత నేరస్థులకు జీవితఖైదు(Life imprisonment) విధిస్తూ నల్లగొండ ఫ్యామిలీ కోర్టు అదనపు 3వ జడ్జి డి. దుర్గా ప్రసాద్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డు శ్రీనిగర్ కాలనీకి చెందిన అనుములు రమేష్ కుమారుడు వంశీ కృష్ణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Dasara : ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్

గ్రీన్స్ హిల్స్ కాలనీలో ఘర్షణ, హత్య

ఏప్రిల్ 25, 2014న వంశీ కృష్ణ తన స్నేహితులతో కలిసి గ్రీన్స్ హిల్స్(Greens Hills) కాలనీలో పార్టీ చేసుకుంటున్న సమయంలో, నలపురాజు రాజేష్ మరియు పెరిక సాయితేజ (టిల్లు) అక్కడికి వెళ్లారు. అక్కడ మాటామాటా పెరగడంతో రాజేష్, టిల్లు తమ వెంట తెచ్చుకున్న కత్తితో వంశీకృష్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో వంశీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

మృతుడి తండ్రి ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో(Court) వాయిదాలపై నడుస్తున్న ఈ కేసు శుక్రవారం తుది తీర్పుకు వచ్చింది.

కోర్టు తీర్పు వివరాలు

కేసు పూర్వాపరాలను పరిశీలించిన జడ్జి డి. దుర్గా ప్రసాద్, రాజేష్‌ను మరియు సాయితేజ (టిల్లును) సెక్షన్ 302 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద దోషులుగా నిర్ధారించారు. వారికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

ఈ హత్య కేసులో నిందితులకు ఎలాంటి శిక్ష పడింది? నల్లగొండ ఫ్యామిలీ కోర్టు ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది.

హత్య ఎప్పుడు జరిగింది?

2014, ఏప్రిల్ 25న ఈ హత్య జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

court judgment Google News in Telugu Latest News in Telugu life imprisonment Murder case nalgonda police investigation. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.