ప్రేమ గొప్పదే కానీ దానికి కొన్ని పరిమితులున్నాయి. ప్రేమించడం తప్పు కాదు.. కానీ హద్దులు దాటేంతవరకు రాకూడదు. చదువు, కెరీర్ ని తీర్చిదిద్దుకునే వయసులో ప్రేమలు, సహజీవనం అంటూ జీవిస్తే.. దాని పర్యవసానం విషాదంగానే ఉంటాయి. తాజాగా ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండగా హఠాత్తుగా తండ్రి వచ్చాడు.
Read Also: AP Crime: రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..
దీంతో ఆ యువతి తప్పించుకునే ప్రయత్నంలో(Crime) మరణించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగిన విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరయ్యింది. అయితే ఖాళీగా ఉంటున్న ఇంటికి శుక్రవారం ఆయన కూతురు ఫాతిమా (20) ప్రియుడు (హుస్సేన్ అలీ)తో కలిసి వెళ్లింది. వీరిద్దరు ఒకే రూంలో(Crime) ఉన్న సమయంలో ఆమె తండ్రి అక్కడికి వచ్చి తలుపులు తట్టాడు. తండ్రి గొంతు విన్న ఫాతిమా తాను దొరికిపోతానేమో అని హుస్సేన్ అలీ సహకారంతో బాల్కనీ నుంచి పక్క ప్లాట్లకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే దురదుష్టవశాత్తు కాలు జారి 8వ అంతస్తు నుంచి కిందపడిపోయింది. దీంతో ఫాతిమా మృతి చెందింది. ఫాతిమా కుటుంబ సభ్యులు తమ కూతురు దుర్మరణంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: