ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన ఓ విషాద ఘటన కలచివేసింది. ప్రియుడి వేధింపులు భరించలేక ఒక యువతి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. 20 ఏళ్ల వయస్సున్న ఈ యువతి డిగ్రీ ఫైనల్ (Degree final) ఇయర్ చదువుతోంది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది.ఈ విషాద ఘటన నేపథ్యంలో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను ప్రియుడు మానసికంగా, శారీరకంగా వేధించాడని, ఆ వేధింపులే ఆమెను ఈ భయంకరమైన నిర్ణయం తీసుకునేలా చేశాయని ఆయన వాపోయారు. ప్రియుడు తన కుమార్తెతో ఉన్న వ్యక్తిగత ఫోటోలు (Personal photos) బయటపెడతానని బెదిరించాడని, ఇదే ఆమెను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని తెలిపారు. అంతే కాదు, ఆమె తను చెప్పినట్లు వినకపోతే పెట్రోల్ పోసి చంపేస్తానని కూడా బెదిరించాడని చెప్పారు.
నంబర్ బ్లాక్ చేయమని తన కుమార్తెకు
ప్రియుడి వేధింపులు భరించలేక.. ఆరు నెలల క్రితం తన కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. లవర్ తనను పర్సనల్ ఫొటోలతో బెదిరిస్తున్నాడని అతడిపై ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు మాత్రం అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పైగా అతడి నంబర్ బ్లాక్ చేయమని తన కుమార్తెకు సలహా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సరిగా స్పందించి ఉంటే తన కుమార్తెకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అతడు ఆవేదన వ్యక్తం చేశారు.నెల రోజుల వ్యవధిలో తరచుగా ఇలాంటి దారుణాలే వెలుగు చూస్తుండటంతో అసలు ఒడిశాలో ఏం జరుగుతోంది.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. నిందితుడి వేధింపుల గురించి యువతి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు అతడిపై చర్యలు తీసుకునే ఉంటే.. ఇవాళ ఆ యువతి ప్రాణాలతో ఉండేదని.. సదరు యువతిది ఆత్మహత్య కాదు.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఒడిశా రాజధాని ఏది?
ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్.
ఒడిశాలో ప్రసిద్ధమైన దేవాలయం ఏది?
పురీలోని జగన్నాథ స్వామి ఆలయం ఒడిశాలో ప్రసిద్ధమైన హిందూ దేవాలయం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: