📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Telugu News: Crime: మహిళపై సామూహిక అత్యాచారం.. హత్య

Author Icon By Sushmitha
Updated: September 23, 2025 • 5:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మద్యం మత్తులో ఉన్న మహిళపై సామూహిక(Collective) అత్యాచారం(rape) జరిగింది. అంతటితో ఆగకుండా ఆమెను హతమార్చారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద ఈనెల 17న ఓ మహిళ మృతదేహం బయటపడింది. ఒంటిమీద బట్టలు లేకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమూచారం అందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాగా ఫోరెన్సిక్(Forensic) నివేదికలో మహిళపై లైంగిక దాడి జరగడంతో పాటు మర్మాంగంలో తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది. ఈ విషయమై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

జల్లెడ పట్టిన సీసీ ఫుటేజీలు

కాగా, మహిళను హత్యను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కిస్మత్ పూర్ వైపు వచ్చిపోయే సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో ఒక ఆటో కిస్మత్పూర్ బ్రిడ్జి వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీ కెమెరాలను మరింత నిశితంగా పరిశీలించగా ఆ ఆటో అదేరోజు మధ్యాహ్నం హైదర్ గూడ కల్లు కంపౌండ్ వద్ద నుంచి ఒక మహిళను ఎక్కించుకుని వచ్చినట్లు తేలింది. అదే సమయంలో హత్యకు గురైన మహిళ ఆదివారం యాకుత్ పురా నుంచి హైదరూడాలలో ఉన్న కల్లు కంపౌండ్కు వచ్చినట్లు ఉంది. దీంతో ఆటో నెంబర్ ఆధారంగా టోలీచౌకికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా, వారు చేసిన నేరాన్ని అంగీకరించారు.

మృగాళ్లకు చిక్కిన మహిళ

ఈనెల 14న యాకుతురాకు చెందిన ఒక మహిళ కల్లు తాగేందుకు హైదర్ గూడలో ఉన్న కల్లు కంపౌండ్ కు వచ్చింది. విపరీతంగా కల్లు సేవించిన అనంతరం ఆ మతుతలో రోడ్డుపక్కన ఉన్న ఫుట్పాత్ పై పడిపోయింది. అదేసమయంలో టోలీచౌకికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లు ఆ  ప్రాంతానికి చేరుకున్నారు. రోడ్లుపై పడి ఉన్న మహిళను గమనించి, బలవంతంగా ఆమెను ఆటో డ్రైవర్లు ఆటోలో ఎక్కించుకుని, బుద్వేల్ మీదుగా కిస్మత్పూర్ బ్రిడ్జ్లవైపు తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన మహిళ వారిని ప్రతిఘటించింది. దీంతో రెచ్చిపోయిన మృగాళ్లు ఆ మహిళను వివస్త్రను చేయడమే కాకుండా ఆమె మర్మాంగంపై కర్రలు గుచ్చి, చిత్రహింసలు పెట్టి, కిరాతకంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఈ ఘోరం ఎక్కడ జరిగింది?

ఒక మహిళపై సామూహిక అత్యాచారం, హత్య జరిగింది.

ఈ ఘటనలో పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేశారా?

ఈ వార్త ప్రకారం, ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

gang rape Google News in Telugu Justice Latest News in Telugu Murder police investigation sexual assault Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.