📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

News Telugu: Crime: ప్రేమజంటలు, ఒంటరి అమ్మాయిలే టార్గెట్ వీడియో తీసి ఆపై బెదిరించడం

Author Icon By Rajitha
Updated: October 4, 2025 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రేమజంటలు, ఒంటరి అమ్మాయిలే టార్గెట్ గోప్యతను వీడియో తీసి ఆపై బెదిరించడం చిత్తూరు : చిత్తూరు మురకంబట్టు నగరవనం పార్కు పరిసరాల్లో ప్రేమజంటలు, ఓంటరి అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద వున్న నగదు దోచుకోవడంతో పాటు వారిని శారీరకంగా అనుభవించడమే మైనర్ బాలిక అత్యాచారం కేసులో అరెస్టైన నిందితుల వృత్తి అని చిత్తూరు డిఎస్పీ సాయినాధ్ Chittoor DSP Sainath పేర్కొన్నారు. మురకంబట్టు Murakambattu నగరవనంలో అత్యాచారంకు గురైన మైనర్ బాలిక కేసులో ముగ్గురు నిందితులను శుక్రవారం చిత్తూరు తాలుకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

Karnataka: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య, ప్రమాదంగా నాటకం!

Crime

ఇందుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ సాయినాధ్ శుక్రవారం చిత్తూరు జిల్లా పాత పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితులైన చిత్తూరు మురకంబట్టు జికెనగర్కు చెందిన ఎం.మహేష్ అలియాస్ కట్టమంచి మహేష్(21), మురకంబట్టు ఎం. ఆగ్రహారంకు చెందిన పి.కిషోర్(31), సంతపేట మంగసముద్రంకు చెందిన జె. హేమంత్ ప్రసాద్(27)లను పోలీసులకు అందిన సమాచారం మేరకు శుక్రవారం చిత్తూరు నగరంలోని చెన్నమగుడిపల్లి రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ నిర్మించిన యోగ అరుగుల సమీపంలో అరెస్టు చేశామన్నారు.

మైనర్ అమ్మాయిని

ఈ కేసులో నిందితుడైన మహేష్ 2019 సంవత్సరంలో చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ అమ్మాయిని ఈవ్తోజింగ్ చేసిన కేసులో నిందితుడిగా వున్నాడన్నారు. అలాగే మరో నిందితుడు కిషోర్ 2022 సంవత్సరంలో నగరంలోని ఓ వైన్ షాపులో పని చేస్తూ షాపులోని మద్యంను బ్లాక్ విక్రయిస్తున్నాడని కేసు నమోదు అయ్యిందన్నారు. ఈ కేసులోని నిందితులు ముగ్గురు కాలక్షేపం కోసం పార్కులకు వచ్చే ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద వున్న నగదును దోచుకుని వారిని శారీరకంగా అనుభవించడం వీరి నేర ప్రవృత్తి అని తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద వున్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఈ కేసు ఏ జిల్లాలో జరిగింది?
చిత్తూరు జిల్లా మురకంబట్టు నగరవనం పరిసరాల్లో జరిగింది.

నిందితులు ఎవరూ?
ఎం. మహేష్ అలియాస్ కట్టమంచి మహేష్ (21), పి. కిషోర్ (31), జె. హేమంత్ ప్రసాద్ (27).

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Chittoor extortion latest news lone girls love couples minor girl assaultBreaking News Murakambattu robbery Telugu News video blackmail

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.