📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Crime: హనుమకొండలో నర్సింగ్‌ విద్యార్థినిపై కెమికల్ దాడి కలకలం

Author Icon By Rajitha
Updated: December 2, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హనుమకొండ (Hanumakonda) జిల్లా కాజీపేట సమీపంలోని కడిపికొండ ప్రాంతంలో నర్సింగ్ విద్యార్థినిపై గుర్తుతెలియని రసాయనం చల్లిన ఘటన సోమవారం సాయంత్రం కలకలం రేపింది. బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని స్కూటీపై అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా కాళ్లపై అకస్మాత్తుగా చల్లదనం, వెంటనే మంట అనుభవించడంతో ఆగి చూసింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం కాలు భాగంలో రసాయనంతో గాయం ఏర్పడింది.

Read also: TTD: సిఐడి నివేదికే కీలకం.. పరకామణి కేసులో తీర్పు కోసం నిరీక్షణ

Chemical attack on nursing student in Hanumakonda

వాహనం ఆపి రసాయనం చల్లినట్లుగా

ఘటన స్థలాన్ని పరిశీలించిన మడికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషన్, అక్కడి నుంచి పసుపు రంగు ద్రావణం ఉన్న ప్లాస్టిక్ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. అది ఏ రకపు రసాయనమో ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, అక్కడ బైక్‌పై కూర్చున్న ఒక వ్యక్తి రసాయనం చల్లినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై యాసిడ్ దాడి అనుమానాలు వ్యక్తమవడంతో స్థానికంగా భయాందోళనలు పెరిగాయి.

స్థానికుల సమాచారం ప్రకారం, స్కూటీపై ప్రయాణిస్తున్న ఆమెను ఒక వ్యక్తి వెంబడించాడని, ఆమె రూట్ ను మరో వ్యక్తికి మొబైల్ ద్వారా తెలియజేశాడనే అనుమానాలు ఉన్నాయి. అనంతరం ఎదురు దిశగా వచ్చిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు వాహనం ఆపి రసాయనం చల్లినట్లుగా ప్రచారం ఉంది. హెల్మెట్ కారణంగా తలకు గాయం కాకపోయినా, ఘటన వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా తెలియలేదు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తూ, సెక్షన్ 124(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Chemical Attack latest news Nursing Student Telugu News warangal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.