हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Latest News: Crime: దొంగతనం కేసులో మహిళను చితకొట్టిన యజమాని..అయితే సీన్ రివర్స్

Anusha
Latest News: Crime: దొంగతనం కేసులో మహిళను చితకొట్టిన యజమాని..అయితే సీన్ రివర్స్

బెంగళూరు (Bangalore) లో జరిగిన ఒక దారుణ సంఘటన ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. నగరంలోని ఒక ప్రసిద్ధ చీరల షాపులో మహిళ ఒక పెద్ద మొత్తంలో చీరలను దొంగిలించిందని షాపు యజమాని ఆరోపించారు.చీరలు కొనుగోలు చేస్తానంటూ ఓ దుకాణంలోకి వెళ్లిన మహిళ.. అక్కడే చాలా సేపు ఉండి రూ.90 వేల విలువ చేసే చీరలు దొంగిలించింది.

ఈ విషయం గుర్తించిన షాపు యజమాని, అతని సిబ్బంది మహిళను నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. ఆపై అత్యంత దారుణంగా కొట్టారు. కాళ్లతో తన్నుతూ.. తీవ్ర పదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్ కావడంతో.. ఈ చర్యపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Crime: అయ్యో ఎంతపని జరిగింది చిట్టితల్లి.. పాలగిన్నెలో పడిన చిన్నారి

ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బెంగళూరు అవెన్యూ రోడ్డులోని ‘మాయా సిల్క్స్ శారీస్’ అనే వస్త్ర దుకాణంలోకి ఈ నెల 20వ తేదీన ఓ మహిళ ప్రవేశించింది. దుకాణదారుల కళ్లుగప్పి సుమారు రూ.91,500 విలువ చేసే 61 చీరలు ఉన్న ఒక కట్టను ఆమె దొంగిలించింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో (CCTV cameras) రికార్డయ్యాయి.

దీనిపై దుకాణం యజమాని సిటీ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అయితే, మరుసటి రోజే ఆ మహిళ మళ్లీ అదే దుకాణం వద్ద కనిపించడంతో యజమాని, అతని సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. దొంగిలించిన చీరల గురించి నిలదీస్తూ, ఆమెను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. కాళ్లతో తంతూ, తీవ్ర పదజాలంతో దూషించారు.

కన్నడ సంఘాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం

ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.ఈ వీడియోపై కన్నడ సంఘాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దొంగతనం చేస్తే పోలీసులకు అప్పగించాలి కానీ, ఇలా నడిరోడ్డుపై ఒక మహిళపై దాడి చేయడం ఏమిటని మండిపడ్డారు.

ఒత్తిడి పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు.దొంగతనం ఆరోపణలపై సదరు మహిళను అరెస్ట్ చేసి, ఆమె నుంచి చీరలను స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళపై దాడికి పాల్పడిన దుకాణం యజమాని, అతని సిబ్బందిని కూడా అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

పరకామణి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోండి: హైకోర్ట్

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా

పైకి పాన్ మసాలా లోపల డ్రగ్స్ దందా

మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి
0:30

మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
0:21

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

శబరిమల యాత్రలో కారు-కంటెయినర్ ఢీ: ఇద్దరు మృతి

శబరిమల యాత్రలో కారు-కంటెయినర్ ఢీ: ఇద్దరు మృతి

ప్రేయసిని కారుతో గుద్దించి.. తల్లిదండ్రులను మెప్పించాడు..చివర్లో ఊహించని ట్విస్ట్

ప్రేయసిని కారుతో గుద్దించి.. తల్లిదండ్రులను మెప్పించాడు..చివర్లో ఊహించని ట్విస్ట్

అల్లిపూర్ తండా కారు ప్రమాదం.. పలువురు గాయపడ్డారు
0:07

అల్లిపూర్ తండా కారు ప్రమాదం.. పలువురు గాయపడ్డారు

తుర్క్ మన్ గేట్ వద్ద హింసాత్మక ఘటన: 30 మంది గుర్తింపు

తుర్క్ మన్ గేట్ వద్ద హింసాత్మక ఘటన: 30 మంది గుర్తింపు

📢 For Advertisement Booking: 98481 12870