Crime: మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో, వారు ఏళ్ల తరబడి సేకరించిన పార్టీ నిధుల కదలికపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. సమాచారం ప్రకారం, ఈ నిధుల వ్యవహారంలో విస్తృత ఆర్థిక నెట్వర్క్ ఉన్నట్లు NIA గుర్తించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా అధికారులు సేకరించిన వివరాల ప్రకారం, కొవిడ్ (covid) కాలంలో మావోయిస్టులు తమ సేకరించిన నిధులను బంగారంగా మార్చి భద్రపరిచినట్లు ఆధారాలు లభించాయి.
Read also: Samineni Ramarao: CPM నేత దారుణ హత్య

Crime: మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం గుట్టు!
Crime: అంతేకాకుండా, పార్టీకి సానుభూతి చూపే వ్యక్తుల పేర్లతో నకిలీ సంస్థలు స్థాపించి, వాటి ద్వారా కోట్ల రూపాయలు మళ్లించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధుల విలువ రూ.400 కోట్ల వరకు ఉండొచ్చని, దానిలో 400 కిలోల బంగారం కూడా ఉండే అవకాశం ఉందని విచారణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా బహిర్గతం చేయడానికి నిఘా సంస్థలు గట్టిగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: