Latest news: Chhattisgarh Train Accident: గూడ్స్ ను ఢీకొన్న రైలు 11 మంది మృతి..ఎక్సగ్రేషియా

Read Time:  1 min
Chhattisgarh Train Accident
Chhattisgarh Train Accident
FONT SIZE
GET APP

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో నిన్న మధ్యాహ్నం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన రైల్వే భద్రతా వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

Read Also: Uttar Pradesh:రైలు ఢీకొని నలుగురు దుర్మరణం

బిలాస్‌పూర్ స్టేషన్ (Bilaspur Station) సమీపంలో ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలును వేగంగా వచ్చిన లోకల్ ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. లోకల్ ట్రైన్ సిగ్నల్‌ను దాటి ముందుకు వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.బిలాస్‌పూర్-కట్నీ సెక్షన్‌లో ఈ ప్రమాదం సంభవించింది.

ఢీకొన్న తీవ్రతకు లోకల్ ట్రైన్ బోగీలు చెల్లాచెదురై పట్టాలు తప్పాయి. విద్యుత్ తీగలు, సిగ్నలింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే రైల్వే సహాయక బృందాలు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

Chhattisgarh Train Accident
Chhattisgarh Train Accident

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తీవ్ర దిగ్భ్రాంతి 

ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని పేర్కొన్నారు. బిలాస్‌పూర్ కలెక్టర్‌తో మాట్లాడి తక్షణ సహాయక చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.

మరోవైపు, రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపి, ప్రమాదానికి కచ్చితమైన కారణాలను తేల్చనున్నారు.ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఎల్‌టీటీ-షాలిమార్ ఎక్స్‌ప్రెస్, ముంబై-హౌరా మెయిల్, గోండియా-రాయ్‌గఢ్ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాక్‌ను క్లియర్ చేసి, రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.