Medipally crime: హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Read Time:  1 min
Medipally crime: హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
FONT SIZE
GET APP

Medipally crime: హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో నివసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని నందిని తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Read Also: Siddipet: సిద్దిపేటలో విషాదం: సాగునీరు అందక రైతు ఆత్మహత్య

Medipally crime: B.Tech student commits suicide in Hyderabad
Medipally crime: B.Tech student commits suicide in Hyderabad

ఘటన వివరాలు

మృతురాలు నందిని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె స్వస్థలం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామం. నారపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న నందిని, తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

Medipally crime: పోలీసుల దర్యాప్తు

హాస్టల్ యజమాని సమాచారం మేరకు మేడిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.