తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) లో, గత కొద్ది రోజులుగా నగరంలోని పలువురు ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలకు వరుసగా బాంబు హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా ప్రముఖ నటి త్రిష (Trisha) నివాసానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.చెన్నై ఆళ్వార్పేట్ లోని త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది.
Read also: Imanvi: ప్రభాస్ ఆతిథ్యనికి ఫౌజీ భామ ఇమాన్వీ ఫిధా..కడుపు నిండిపోయిందంటూ..
అప్రమత్తమైన పోలీసులు
దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా పోలీసులు తేల్చారు.
ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తేనాంపేట పోలీసులు తెలిపారు. కాగా, త్రిష (Trisha) నివాసానికి ఇలా బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: