చెన్నై నగరంలోని పక్కికరనై ప్రాంతంలో 22 ఏళ్ల యువతి ప్రయాణికురాలిగా బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. కానీ ఈ సాధారణ ప్రయాణం ఆమె జీవితంలో దుర్ఘటనగా మారింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు సోమవారం రాత్రి చెన్నై (Chennai) లోని పక్కికరనై ప్రాంతంలో ఉన్న తన స్నేహితురాలిని కలిసేందుకు బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది.
Read Also: Kenya: కెన్యా విమాన దుర్ఘటనలో 11మంది మృతి
డ్రైవర్గా వచ్చిన శివకుమార్ను తన తిరుగు ప్రయాణం కోసం కూడా వేచి ఉండాలని కోరింది. మంగళవారం ఉదయం ఆమెను ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో శివకుమార్ ఉద్దేశపూర్వకంగా బైక్ను నిర్మానుష్యంగా ఉన్న మార్గంలోకి మళ్లించాడు.అక్కడ ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అనంతరం బాధితురాలిని ఆమె ఇంటి వద్ద దించి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన గురించి ఆమె తన భర్తకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు T5 వనగరం పోలీసులు విచారణ చేపట్టారు. “ఫిర్యాదుపై విచారణ జరిపి, ఆరోపణలు వాస్తవమేనని నిర్ధారించుకున్నాం.

మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆందోళన
నిందితుడు శివకుమార్ను గుర్తించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.కాగా, తమిళనాడు (Tamil Nadu) లో మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అయితే, ఈ ఆరోపణలను అధికార డీఎంకే ప్రభుత్వం (DMK Govt), రాష్ట్ర పోలీసులు ఖండిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: