ఆన్లైన్ బెట్టింగ్ (Online betting) వ్యసనం ఓ కుటుంబాన్ని చీకట్లోకి నెట్టింది. డబ్బు కోసం కన్న కొడుకు తండ్రి ప్రాణాలు తీసిన సంఘటన గచ్చిబౌలిలో వెలుగుచూసింది. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.వనపర్తి జిల్లాకు చెందిన హనుమంత్ నాయక్ ఇటీవల భూమిని అమ్మాడు. దాంతో వచ్చిన రూ.6 లక్షల నగదును ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఆ డబ్బే కుటుంబం కన్నీటి గాధకు కారణమైంది. ఆయన కుమారుడు రవీందర్ నాయక్ ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారాడు.ఇంట్లో ఉన్న డబ్బులో రూ.2.5 లక్షలను రవీందర్ తస్కరించాడు. ఆ మొత్తాన్ని బెట్టింగ్లో వేసి పూర్తిగా పోగొట్టేశాడు. డబ్బు నశించిన విషయాన్ని తండ్రికి చెప్పలేక రకరకాల కథలు చెప్పాడు.
స్నేహితుడి పేరు చెప్పి తండ్రిని మోసగించాడు
హనుమంత్ డబ్బు గురించి అడిగితే, స్నేహితుడికి అప్పు ఇచ్చానని రవీందర్ సమాధానం ఇచ్చాడు. చివరికి మంగళవారం మధ్యాహ్నం డబ్బు తిరిగిస్తాడంటూ తండ్రిని తన వెంట తీసుకెళ్లాడు. గచ్చిబౌలిలోని నిర్మానుష్య ప్రాంతంలో చాకచక్యంగా హత్యకు పాల్పడ్డాడు.
కత్తితో గొంతు కోసి హత్య
తన వెంట తీసుకెళ్లిన కత్తితో తండ్రి గొంతు కోసి హత్య (Father was murdered by slitting his throat with a knife) చేశాడు. అనంతరం తన బావ రమేష్ నాయక్కు ఫోన్ చేసి తండ్రి చనిపోయాడని చెప్పాడు. అయితే రవీందర్ ప్రవర్తనతో కుటుంబ సభ్యులు అనుమానం పొంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అరెస్ట్ చేసిన పోలీసులు – దర్యాప్తు కొనసాగుతోంది
గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. రవీందర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Read Also : Harish Rao : కేసీఆర్ వాటర్ మ్యాన్ .. రేవంత్ రెడ్డి వాటా మ్యాన్ – హరీశ్రావు