బెంగళూరు (Bengaluru Crime) లో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ యువతి తన తల్లి, పిన్ని ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను తన ప్రియుడికి పంపింది. చదువు కోసం మొబైల్ ఫోన్ తీసుకున్న 23 ఏళ్ల యువతి ఈ చర్యకు పాల్పడింది. యువతి తల్లి మొబైల్ను చెక్ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. దీంతో బాధిత తల్లి తన కుమార్తె, ఆమె ప్రియుడిపై బ్యాటరాయణపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.సమాచార సాంకేతిక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: America: బిట్ కాయిన్ పనికిరానిది, దాని విలువ జీరోనే..ఫార్ వ్యాఖ్యలు
ఫోన్ ను చెక్ చేయడంతో అసలు నిజం బయటపడింది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన 23 ఏళ్ల యువతి తన చదువుకు, ఉద్యోగ ప్రయత్నాలకు అవసరమని కోరడంతో తండ్రి ఆమెకు ఒక స్మార్ట్ఫోన్ కొనిచ్చారు. ఈ ఫోన్ తో కూతురు తన తల్లి నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్రైవేట్ భాగాలను ఫోటోలు తీయడం,
బంధువు స్నానం చేస్తున్నప్పుడు రహస్యంగా వీడియోలు తీయడం వంటి పనులకు పాల్పడింది. వాటిని తన ప్రియుడికి పంపించింది.ఇటీవల కూతురు గదిలోకి వెళ్లిన తల్లికి ఆమె ఒక గుర్తుతెలియని వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతుండడం గమనించింది. తనను చూడగానే కూతురు ఆ కాల్ ను కట్ చేయడంతో అనుమానించింది. ఆ తర్వాత కూతురు ఫోన్ ను చెక్ చేయడంతో అసలు నిజం బయటపడింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: