हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Telugu News: Medchal-బార్ బిల్లు వివాదం… బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Pooja
Telugu News: Medchal-బార్ బిల్లు వివాదం… బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌కు చెందిన జాదవ్ సాయితేజ (బీటెక్ రెండో సంవత్సరం), ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతూ నారపల్లిలోని(Narapalli) హాస్టల్‌లో ఉండేవాడు.

తాజాగా తన స్నేహితులతో కలిసి ఒక పుట్టినరోజు వేడుకకు హాజరైన సాయితేజ, అక్కడ చిన్నపాటి గొడవ తలెత్తడంతో సీనియర్ విద్యార్థి బండారి చిన్నబాబు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చాడు. అయితే, దీని ప్రతిఫలంగా పార్టీ అడిగిన చిన్నబాబు, సాయితేజను మరికొంతమంది విద్యార్థులతో కలిసి బార్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం బిల్లు రూ. 8,000 వస్తే, సాయితేజ దగ్గరున్న రూ. 2,500 మాత్రమే చెల్లించాడు. మిగిలిన మొత్తానికి ఒత్తిడి చేయడంతో పాటు, అందరి ఎదుట తీవ్ర అవమానం ఎదుర్కొన్నాడు.

Medchal

మృతిపై విద్యార్థి సంఘాల ఆందోళనలు

దీంతో మనస్తాపానికి గురైన సాయితేజ, హాస్టల్ గదికి వెళ్లి తన తండ్రికి వీడియో కాల్ చేసి, సీనియర్ వేధింపులు(Senior harassment) భరించలేక ఆత్మహత్యకు పాల్పడతానని తెలిపాడు. అనంతరం గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ ఆర్. గోవిందరెడ్డి వెల్లడించారు.

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కళాశాల ముందు, పోలీస్ స్టేషన్ వద్ద, జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టాయి. కళాశాల యాజమాన్యం స్పందిస్తూ, ప్రధాన నిందితుడు చిన్నబాబు గత ఏడాది నుంచి తరగతులకు హాజరుకాలేదని స్పష్టం చేసింది.

సాయితేజ ఎవరు?
ఆదిలాబాద్‌కు చెందిన సాయితేజ, ఘట్‌కేసర్‌లోని ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం బీటెక్ విద్యార్థి.

ఆత్మహత్యకు కారణం ఏమిటి?
సీనియర్ విద్యార్థి పార్టీ పేరుతో ఒత్తిడి చేయడం, బార్ బిల్లు చెల్లించలేకపోవడంతో అవమానించడం కారణంగా సాయితేజ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870