ప్రేమ గుడ్డిది అంటారు. ఆధునికయుగంలో ఎవరినీ నమ్మలేని పరిస్థితులు దాపురించాయి. ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియా వచ్చాక ఆన్ లైన్ ప్రేమలు ఎక్కువై, మోసాలకు పాల్పడుతున్నారు. ముక్కుమొహం తెలియని వారిని నమ్మేసి, తమ సర్వంఅర్పించుకుని, ఆ తర్వాత మోసపోయామని ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి వార్తల్నిమనం చూస్తునే ఉన్నాం. తాజాగా ముగ్గురు మైనర్ బాలికలను యాదగిరిగుట్ట (Yadagirigutta) కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు నలుగురు యువకులు.
పోక్సో చట్టం కింద కేసు
హైదరాబాద్-ఆల్వాల్ ప్రాంతంలో పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్ బాలికలను
యువకులు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. సరదాగా బయటకు వెళ్లిన ఈ బాలికలు ముగ్గురు మృగాళ్ల చేతిలో చిక్కారు. మాయమాటలు చెప్పి పిక్నిక్ పేరుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారం (Rape) చేశారు. ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. అల్వాల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వెంకటాపురానికి చెందిన ముగ్గురు బాలికలు బతుకమ్మ (Bathukamma) వేడకులకు అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. వీరు వెళ్తున్నప్పుడే ఆధార్కార్డులను తీసుకెళ్లారు.
వీరు స్కూలుకు వెళ్లకుండాఆల్వాల్ నుంచి బస్సెక్కి సికింద్రాబాద్ (Secunderabad) కు చేరుకున్నారు. అక్కడ నుంచి ఉస్మానియా వర్సిటీకి వెళ్లి, అక్కడ బస్టాపులో నిలబడ్డారు. జీహెచ్ఎంసీ (GHMC) లో కాంట్రాక్టు పద్ధతిలోపనిచేస్తున్న 19ఏళ్ల యువకుడు గండికోట మధు (19), వీరి స్నేహితుడు వంశీ అరవింద్ (22), సమీప బంధువు అయిన నీరజ్ (21)ను పిలిచాడు. వీరికి ఈ ముగ్గురుబాలికలు కనిపించేసరికి వారిని మాటల్లో దింపారు.
Hyderabad : ఆర్టీఓ చలాన్, పీఎం కిసాన్ పేరుతో సైబర్ మోసం
లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు
అనంతరం వీరందరూ ఓ హోటల్కు వెళ్లి భోజనం చేసి, సరదాగా బయటకు వెళ్తామని అనుకుని అందరూ బస్సులో యాదగిరిట్టుకు తీసుకెళ్లారు. అక్కడ లాడ్జి,గదులు తీసుకుని, రాత్రంతా బాలికలపై అత్యాచారం చేసి, ఉదయం ఓయూ (OU) పీఎస్ పరిధిలో బాలికలను వదిలిపెట్టి, ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
20వ తేదీన ముగ్గురు విద్యార్థినీలు స్కూలుకు రాకపోవడంతో తల్లిదండ్రులకు టీచర్ ఫోన్ చేశారు. దీంతో పోలీసులను ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మర్నాడు ఆదివారం ఉదయం బాలికలే తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తాము యాదగిరిగుట్టకు వెళ్లివచ్చామని చెప్పారు. అయితే వారు గట్టిగా నిలదీసేసరికి జరిగిదంతా చెప్పారు.
దీంతోతల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వైద్యపరీక్షలు చేయించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు నిందితులతోపాటు గది అద్దెకు ఇచ్చిన సోమేశ్ అనే అవ్యక్తి కూడా అరెస్టు చేశారు. వీరిపై పోక్సోకేసు (POCSO case) ను నమోదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: