Asifabad Crime: చైన్ స్నాచర్ల కలకలం.. 30 గ్రాముల బంగారం చోరీ

Read Time:  1 min
Chain snatchers create panic
Chain snatchers create panic
FONT SIZE
GET APP

ఆసిఫాబాద్ పట్టణంలో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. వాహనం పార్కింగ్ విషయం అడుగుతున్నట్టు నటిస్తూ, అంజలి అనే మహిళను మాటల్లో పెట్టిన దుండగులు, ఆమె మెడలో ఉన్న సుమారు 30 గ్రాముల బంగారు గొలుసును చాకచక్యంగా లాక్కొని పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Read also: Haryana: ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి

Chain snatchers create panic

Chain snatchers create panic

సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దొంగలు హెల్మెట్లు (Helmet) ధరించి ఉండటంతో వారి ముఖాలు స్పష్టంగా కనిపించకపోవడం పోలీసులకు సవాలుగా మారింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

మహిళల్లో పెరుగుతున్న భయాందోళన

వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలతో ఆసిఫాబాద్‌లో మహిళలు భయంతో బయటకు రావడానికే సందేహిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ లేని ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.