Anakapalli accident: రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

Read Time:  1 min
Anakapalli accident: రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
FONT SIZE
GET APP

Anakapalli accident: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నూతనగుంటపాలెం వద్ద ఉన్న నల్లమారమ్మ ఆలయం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని గుర్తుతెలియని వాహనం అతివేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది.

Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

Anakapalli accident: A young man died after being hit by an unidentified vehicle while crossing the road.
Anakapalli accident: A young man died after being hit by an unidentified vehicle while crossing the road.

పోలీసులు కేసు నమోదు

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కశింకోట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.