हिन्दी | Epaper

Maharashtra: అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

Tejaswini Y
Maharashtra: అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

Maharashtra: గత గురువారం బారామతిలోని విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో విమాన ప్రమాదంలో కన్నుమూసిన అజిత్ పవార్(Ajit Pawar) అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఈ అంతిమయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు మరియు అభిమానులు తరలివచ్చారు.

Read Also: AP: వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

Maharashtra: Theft at Ajit Pawar's funeral.. seven arrested
Maharashtra: Theft at Ajit Pawar’s funeral.. seven arrested

పోలీసుల వేట.. ఏడుగురు నిందితులు అరెస్టు

వేలాది మంది గుమిగూడిన ఈ రద్దీని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత సుమారు 15 మంది బాధితులు తాము ధరించిన బంగారు గొలుసులు, విలువైన వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ చోరీల విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. ఈ సామూహిక చోరీని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, అనుమానిత కదలికల ఆధారంగా మంగళవారం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కొంత సొత్తును రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870