ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ సరిహద్దులోని మహారాష్ట్ర కైలాస్ టేకిడిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. చనిపోయిన వ్యక్తి శవంపై ఎలుగుబంటి కూర్చున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. అధికారులు జేసీబీ సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, ఉపాధి పనులకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Thailand: డే కేర్ స్కూల్లో కాల్పులు
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: