Acid Attack in Maharashtra: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా సంగమ్నేర్ తాలూకాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వడ్గావ్ పాన్ ప్రాంతంలో ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై ఒక దుర్మార్గుడు యాసిడ్తో దాడికి పాల్పడ్డాడు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 11:30 నుండి 12:45 గంటల మధ్యలో ఈ ఘోరం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఇలాంటి అమానుషం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Also:Indore Fire Accident: ఇండోర్లో ఘోర అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం!
స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా చిన్నారిపై యాసిడ్ పోసిన దుర్మార్గుడు.

పాఠశాల నుంచి సైకిల్పై ఇంటికి బయలుదేరిన ఆ చిన్నారిని గుర్తుతెలియని యువకుడు దారిలో అడ్డుకున్నాడు. ఏదో అడ్రస్ అడుగుతున్నట్లుగా నటిస్తూ ఆ బాలికను మాటల్లో దింపాడు. ఆమె తేరుకునేలోపే తన వద్ద ఉన్న యాసిడ్ను ఒక్కసారిగా బాలిక ముఖంపై పోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో విలవిలలాడిన ఆ చిన్నారిని చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ అమానుష దాడిపై అహ్మద్నగర్ జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పాఠశాలకు వెళ్లే చిన్నారులకు రక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: