మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో రైతు వేదికలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ (Distribution of Indiramma houses) కార్యక్రమంలో ఆశ్చర్య ఘటనచోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (MLA Yashaswini Reddy) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. నిరుపేదలకు ఇంటి కల నెరవేరుతున్నందుకు ఆమె ఆనందంతో కంటతడి పెట్టారు. ఆమె కన్నీళ్లను చూసిన మహిళలు, పార్టీ కార్యకర్తలు ఆమెను ఓదార్చుతూ “ఊరుకో అక్కా” అంటూ భరోసా ఇచ్చారు.
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం, లబ్ధిదారుల జాబితాను విడుదల చేసి, తొలి విడత కింద ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్థికసహాయం వారి ఖాతాల్లో జమ చేసింది. మొత్తం రూ.5 లక్షల మేర సహాయం దశలవారీగా అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకం అమలులో పారదర్శకత ఉండేందుకు ప్రత్యేక సమీక్ష కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇళ్ల కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రజాప్రతినిధుల భావోద్వేగ స్పందనలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.
Read Also : Erragadda Hospital : ఎర్రగడ్డ హాస్పటల్ లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి!