Congress, AIMIM move Supreme Court on Waqf Bill

Waqf Amendment Bill : వక్ఫ్‌ బిల్లుపై సుప్రీంకోర్టు ఆశ్రయించిన కాంగ్రెస్‌, ఎంఐఎం

Waqf Amendment Bill : పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025పై అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్‌ సవరణ బిల్లును సుప్రీం కోర్టులో ఆయన సవాల్‌ చేశారు. వక్ఫ్‌ బిల్లు చట్ట విరుద్ధమని.. వక్ఫ్‌ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందంటూ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. ఈ వివాదాస్పద బిల్లు ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

Advertisements
వక్ఫ్‌ బిల్లుపై సుప్రీంకోర్టు ఆశ్రయించిన

రాజ్యసభ ఆమోదం కూడా పొందింది

కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్‌ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్‌ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.

అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు

దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్‌ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్‌ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే.

Related Posts
ప్రభల తీర్థాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హవా
prabhala theertham 2025 paw

కోనసీమ జిల్లాలో నిన్న నిర్వహించిన ప్రభల తీర్థాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హవా కనిపించింది. ఏ గ్రామానికి వెళ్లినా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రత్యేక Read more

Revanth Reddy : సామాన్యుడి ఇంట భోజనం చేసిన రేవంత్ రెడ్డి
Revanth Reddy సామాన్యుడి ఇంట భోజనం చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామానికి వెళ్లి ప్రజలతో కలిసిపోయారు. అక్కడే సన్నబియ్యం పథకం ద్వారా Read more

17 వేల మంది ఉద్యోగులపై వేటు: బోయింగ్ విమాన సంస్థ
17 వేల మంది ఉద్యోగులపై వేటు: బోయింగ్ విమాన సంస్థ

ముంబయి: విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే 17 వేల మంది Read more

వివాదంలో రిషబ్ శెట్టి కాంతార 2
వివాదంలో రిషబ్ శెట్టి కాంతార 2

కాంతార చాప్టర్ 2 చిత్రీకరణలో భాగంగా రిషబ్ శెట్టి బృందం అడవులకు నష్టం కలిగించిందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×