allu arjun

అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్ వదిలేసినట్లేనా..?

సినీ హీరో అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం పార్టీకి ప్రతికూలంగా మారుతుందనే ఉద్దేశంతో అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు మద్దతుగా నిలబడుతుందని అన్నారు. సినీ పరిశ్రమలోని కార్మికుల నుంచి నిర్మాతల వరకు అందరికీ మేలు చేకూరాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిల్మ్ నగర్ స్థలాలను కేటాయించడం, సినీ ఇండస్ట్రీని హైదరాబాద్‌కు ఆకర్షించడం వంటి విషయాలను గుర్తు చేశారు.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌కు సంబంధించి కేసు నమోదుకి కారణాలను పోలీసులు వివరించారని తెలిపారు. అనుమతులు లేకుండా ప్రదర్శనలు నిర్వహించడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు.

Related Posts
నేడు పార్టీ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం
పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో Read more

ప్రజా భద్రత..ట్రాఫిక్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు చేయనున్నఐడియాఫోర్జ్ యొక్క ఫ్లైట్ పెట్రోల్ యుఏవి
Ideaforges Flight Patrol UAV is set to revolutionize public safety.traffic management

అధునాతన యుఏవి సొల్యూషన్స్ తెలివైన పోలీసింగ్ మరియు పట్టణ భద్రత పరివర్తనను అందిస్తాయి.. న్యూఢిల్లీ: డ్రోన్ టెక్నాలజీలో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ దాని Read more

రైతు మహా ధర్నాకు అనుమతించిన హైకోర్టు
రైతు మహా ధర్నాకు అనుమతించిన హైకోర్టు

మొదటగా, జనవరి 20న రైతు మహా ధర్నాను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రణాళిక చేసింది. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈ ధర్నాకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో, బీఆర్ఎస్ Read more

ఈ నెల 15న తణుకుకు సీఎం చంద్రబాబు
Soon we will bring internet to every house.. Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకుకు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర Read more