हिन्दी | Epaper
ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

TGSRTC Stirke: ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

Sudheer
TGSRTC Stirke: ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఈ పరిస్థితుల్లో సమ్మె చేయడం ప్రజలకు నష్టం కలిగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తున్నదని, సంస్థను నిలబెట్టేందుకు కార్మికుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. “ఇది మీ సంస్థ.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే,” అంటూ ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

పదేళ్ల పాలన సమయంలో ఆర్థిక దోపిడీ

రాష్ట్రంలో గత పదేళ్ల పాలన సమయంలో ఆర్థిక దోపిడీ జరిగిందని విమర్శించిన సీఎం రేవంత్, “ఆర్టీసీ కార్మికులు పంతాలకు పోకుండా, సమస్యలుంటే మంత్రులతో చర్చించండి. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మీకే వెచ్చిస్తాం. నేను ఇంటికి ఏ అణా పైసా తీసుకెళ్లేది లేదు” అంటూ నిస్వార్థంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు తనను నమ్మాలని కోరారు. రాబోయే ఏడాది ఆర్థికంగా కొంత భద్రత ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మే 5న కార్మిక కవాతు

ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో మే 7 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. మే 5న కార్మిక కవాతు కూడా నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి, స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. సమ్మెని ఆపాలని విజ్ఞప్తి చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Read Also : Metro : హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870