ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) ఢిల్లీ కి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఎన్డీయే పొత్తులో భాగంగా బీజేపీ తరఫున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీకి చంద్రబాబు రేపు వెళ్లనున్నారు. బీజేపీకి మద్దతుగా తెలుగువారున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్‌తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఆదివారం రోజు ఎంపీలతో కలిసి బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రతి పార్టీ తమ అగ్రనాయకులను రంగంలోకి దింపుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో జోరుగా ప్రచారం సాగుతోంది. పోటాపోటీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలు ప్రకటిస్తూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ముఖ్య నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల నేతలతో నేడు ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను కూటమి అభ్యర్థులుగా బలపరిచామని తెలిపారు. ఫిభ్రవరి 27న జరిగే ఎన్నికల్లో వారిని భారీ మెజార్టీతో గెలిపించేలా చూడాలని ఆదేశించారు.

Related Posts
ఘనంగా జరిగిన మిజోరాం,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
ఘనంగా జరిగిన మిజోరాం అరుణాచల్

విజయవాడ, ఫిబ్రవరి 20:ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య Read more

కారును తగలబెట్టిన మావోయిస్టులు
Maoists set the car on fire

చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళుతున్న కారును తగులబెట్టి దుశ్చర్యకు పాల్పడిన మావోయిస్టులు. కారులో ఉన్న ప్రయాణికులను దింపి అనంతరం Read more

ఆట స్థలం కబ్జా పై చర్యలు తీసుకోవాలంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదు
1500x900 1079640 gandhibabji

ఆట స్థలం కబ్జా పై చర్యలు తీసుకోవాలంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదువెలగపూడి : టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భూ సమస్యలతో Read more

జియో Rs.1,899కు 336 రోజులు ప్లాన్
జియో Rs.1,899కు 336 రోజులు ప్లాన్

ముఖేష్ అంబానీ జియో కొత్త ప్రణాళికను ప్రారంభించడంతో, జియో వినియోగదారుల వివిధ అవసరాలను తీర్చేందుకు అనేక రీచార్జ్ ఆప్షన్లను అందిస్తూ వస్తోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు జియో ప్రీపెయిడ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

/