టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తాజా సినిమా గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండటమే ప్రధాన ఆకర్షణ.శంకర్ సినిమాలకు విభిన్నతకు మంచి పేరు ఉంది, అందుకే గేమ్ ఛేంజర్ మీద ఆసక్తి మరింత ఎక్కువైంది.ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు.ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన తర్వాత, ఆచార్య సినిమాలో కనిపించిన చరణ్, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. దీంతో గేమ్ ఛేంజర్ సినిమాపై అభిమానులు మరింత ఆశలు పెట్టుకున్నారు.ఈ చిత్రం ఐదేళ్ల తర్వాత రామ్ చరణ్ సొంతగా నటిస్తున్న మూవీ కావడం, శంకర్ దర్శకత్వం వహించడంతో అంచనాలు నెక్స్ట్ లెవల్కు చేరాయి. గేమ్ ఛేంజర్ షూటింగ్ అనేక రోజులు కొనసాగడంతో సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు తీవ్ర ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
అయితే ట్రైలర్కు సంబంధించిన ఏ వివరాలు మేకర్స్ నుంచి రాలేదు. ఇదే అభిమానుల నిరాశకు కారణమైంది. ట్రైలర్ ఆలస్యంపై ఓ అభిమాని సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వ్యక్తం చేశాడు. తన భావోద్వేగాలను పంచుకుంటూ, బ్రతికుంటే అందరితో చూస్తా.చస్తే ఆత్మ లా చూస్తా. ఇది మీ చేతుల్లోనే ఉంది అంటూ తన అసంతృప్తిని తెలియజేశాడు.ఇంకా, ట్రైలర్ అనౌన్స్ చేయకపోతే, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని హెచ్చరించాడు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ క్రమంలో ట్రైలర్ గురించి ఆసక్తికరమైన వార్తలు బయటకొస్తున్నాయి.డిసెంబర్ 30న ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. కొత్త ఏడాది సందర్భంగా అభిమానులకు ఈ ట్రైలర్ పెద్ద కిక్ ఇస్తుందని చెబుతున్నారు.దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న గేమ్ ఛేంజర్, మెగా ఫ్యాన్స్కి పండగను మించిన ఆనందాన్ని అందించనుంది. శంకర్ దర్శకత్వం, భారీ బడ్జెట్, రామ్ చరణ్ నటన, సినిమా విజయానికి కీలక పాత్రలు పోషించబోతున్నాయి.