మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన ఆర్సీబీ ఫైనల్లోనూ అదే జోరు కనబర్చి ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. గురువారం వడోదర వేదికగా ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో టైటిల్ను ముద్దాడింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ విజయంపై నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు.
Read Also: Pakistan boycott India match : భారత్ మ్యాచ్ బహిష్కరణ, పాక్ సెమీస్ ఆశలపై ముప్పా?
చరిత్ర పునరావృతమైంది
ఆమె భర్త విరాట్ కోహ్లీ ఆర్సీబీ పురుషుల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మహిళల జట్టు ట్రోఫీని అందుకున్న ఫొటోను అనుష్క తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. “ఆర్సీబీ మహిళలు మళ్లీ చేశారు. చరిత్ర పునరావృతమైంది” అని దానికి క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: