Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై పలు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈసారి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తమ వివాహాన్ని ప్రకటించడం ద్వారా అన్ని సందేహాలకు ముగింపు పలికారు. తమ పెళ్లి వేడుకకు ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అనే ప్రత్యేకమైన పేరు పెట్టినట్లు వెల్లడించడం ఈ ప్రకటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Read Also: Taapsee Pannu: సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్
మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు ధన్యవాదాలు
‘విరోష్’ (VIROSH) అనే పేరును ఏ వెడ్డింగ్ ప్లానర్లు, కుటుంబ సభ్యులు సూచించలేదని, ఎన్నో ఏళ్ల క్రితం తమ అభిమానులు ప్రేమతో సృష్టించినదేనని తెలిపారు. తాము ఎలాంటి ప్రణాళికలు వేసుకోకముందే, అభిమానులు తమ బంధానికి ఓ అర్థం ఇచ్చారని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఉద్వేగభరితమైన నోట్ను పంచుకున్నారు.

“మా ప్రియమైన వారికి, మేము ఎలాంటి ప్రణాళికలు వేసుకోకముందే, మా కోసం మేము ఏదీ ఎంచుకోకముందే.. మీరు అప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఎంతో ప్రేమతో, మీరు మాకు ఒక పేరు ఇచ్చారు. మమ్మల్ని ‘విరోష్’ అని పిలిచారు. కాబట్టి ఈ రోజు నిండు మనసుతో, మా ఈ కలయికకు మీ గౌరవార్థం ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెడుతున్నాం. మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ మాలో భాగమే!” అని రాసుకొచ్చారు.కాగా, ఈ నెల 26న ఉదయ్పూర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: