Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోస్ తమ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. నిర్మాణం, పంపిణీ రంగాల్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఈ సంస్థ, తొలిసారిగా పరభాషా చిత్రాల పంపిణీకి అడుగుపెట్టింది. మలయాళంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘EKO’ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విడుదల హక్కులను కైవసం చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read also: Varanasi: రాజమౌళి వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానరసేన ఆగ్రహం – పోలీసులకు ఫిర్యాదు
Annapurna Studios changes direction.. enters a new path with ‘EKO’
Annapurna Studios: ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే పరిమితమైన ఈ కంపెనీ, మొదటిసారి పరభాషా చిత్రాన్ని తెలుగువారికి అందించడానికి సిద్ధమవ్వడం సినిమారంగంలో ఆసక్తికరమైన పరిణామంగా మారింది. దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించిన ‘EKO’ సినిమా ప్రత్యేకమైన కథతో ముందుకు వస్తుండటంతో పరిశ్రమలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
‘EKO’ టీజర్, ట్రైలర్
ఈ సందర్భంగా మాట్లాడిన అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna studios) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ, “మలయాళ సినిమాలు కొత్త కాన్సెప్ట్లతో ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. ఇటీవల తెలుగులో కూడా మంచి స్వీకరణ పొందుతున్నాయి. ‘EKO’ టీజర్, ట్రైలర్ చూసిన వెంటనే ఇది తెలుగు ప్రేక్షకులు కూడా ఆస్వాదించే సినిమా అని అనిపించింది. మా సంస్థ నుంచి ఇదొక కొత్త ప్రయోగం. ఈ తరహా సినిమాలను భవిష్యత్తులో కూడా ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నాం” అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: