ఈ ఏడాది (2025 Movies) అనేక సినిమాలు సూపర్ హిట్గా నిలిచి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే, ఏ ఒక్క తెలుగు సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరలేదు. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో తెలుగు చిత్రాలు లేకపోవడం గమనార్హం.ఈ ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ (2025 Movies) అంటే పవన్ కల్యాణ్ ఓజీ (OG) నే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మూవీ రూ.320 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Read Also: Arnold Schwarzenegger : ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…
సయారా
ఈ ఏడాది భారీ విజయం సాధించిన బాలీవుడ్ చిత్రం ‘సైయర్’. ఈ మూఈ కూడా రూ. 500 కోట్ల క్లబ్లోకి ప్రవేశించింది. ఈ చిత్రంలో అనిత్ పద్దా అహన్ పాండే నటించారు జంటగా నటించారు..
‘కాంతార: చాప్టర్ 1’
రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా వసూళ్లు దాదాపు 900 కోట్ల రూపాయలు.ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించింది..
చావా
విక్కీ కౌశల్, రష్మిక మందన్న తదితరులు నటించిన ‘ఛావా’ చిత్రం ఈ సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 807 కోట్లు వసూలు చేసింది.
‘కూలీ’
రజనీకాంత్ నటించిన ‘కూలీ’ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. టేకింగ్ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 500+ కోట్లు వసూలు చేసింది.
ధురంధర్
ధురందర్ రెండు వారాల్లో రూ. 400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లు దాటింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: