తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్’ విడుదలపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవానికి సంక్రాంతి కానుకగా గత నెల, జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్న కొన్ని సన్నివేశాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
Read Also: Meher Ramesh family tragedy : మెహర్ రమేశ్ ఇంట విషాదం, అదే తేదీన మరో తీరని లోటు
ఈ నెల 20న ‘జన నాయగన్’ విడుదల?
దీంతో ఈ వ్యవహారం మద్రాస్ హైకోర్టుకు చేరింది. సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ విచారణల తర్వాత కూడా విడుదలపై స్పష్టత రాకపోవడంతో నిర్మాతలు నష్టాలను నివారించేందుకు రాజీ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో విజయ్ (Thalapathy Vijay)సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా, ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎలాంటి కొత్త అడ్డంకులు ఎదురుకాకుండా సెన్సార్ క్లియరెన్స్ లభిస్తే, ఈ నెల 20న ‘జన నాయగన్’ థియేటర్లలోకి రావడం ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: