హీరో సుహాస్ (Suhas) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మండాడి’ సినిమా ప్రస్తుతం సినీ అభిమానుల ఆసక్తిని పెంచుతోంది. జాతీయ అవార్డు గ్రహీత వెట్రి మారన్ నిర్మిస్తున్నారు.. సినిమాలో తమిళ నటుడు సూరి (Suri) విలన్గా నటిస్తుండగా, అదే తమిళ్ వెర్షన్లో సుహాస్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.
Khushboo: కరూర్ ఘటనపై బీజేపీ నేత ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై తీర ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి జరిగింది. ఈ చిత్ర షూటింగులో భాగంగా కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు. రామనాథపురం జిల్లా (Ramanathapuram District) తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే, యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణ నష్టం తప్పింది.
ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన కెమెరాల
అయితే ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయాయి. మండాడి సినిమా (Mandadi movie) కు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నాడు. RS ఇన్ఫోటైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వెట్రిమారన్ (Vetrimaran) క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
సుహాస్, సూరిలతో పాటు మహిమా నంబియార్, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ (G.V. Prakash Kumar) స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: