టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్ట్ AA23పై రోజుకో కొత్త అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ అధికారికంగా ఖరారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ ఎంపికపై హాట్ టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కథానాయికగా ఎంపికైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ‘స్త్రీ 2’తో విజయం సాధించిన శ్రద్ధా, గతంలో ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
Read Also: Jayakrishna Ghattamaneni: ‘శ్రీనివాస మంగాపురం’.. రాషా తడాని ఫస్ట్లుక్ విడుదల
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి
లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు తక్కువ ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఈ సినిమాలో శ్రద్ధా (Shraddha Kapoor) పాత్ర ఎంతో కీలకంగా, పవర్ఫుల్గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా పూర్తయిన అనంతరం లోకేష్తో సినిమా చేయబోతున్నాడు.

ఈ ఇద్దరు దిగ్గజాల కాంబోలో రాబోతున్న సినిమా ‘లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) లో భాగంగా ఉంటుందా లేక సోలో ప్రాజెక్టా అన్నది తెలియాల్సి ఉంది. ఈ క్రేజీ అప్డేట్తో అల్లు అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: