
టాలీవుడ్లో ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటీనటులు శివాజీ, లయ (Shivaji-Laya) చాలా కాలం తర్వాత మళ్లీ జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani) ఇప్పుడు మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా డిజిటల్ వేదికగా విడుదలవుతోంది.అయితే ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ (OTT) ఈటీవీ విన్ దక్కించుకోగా ఈ సినిమాను ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
Read Also: Vikrant Massey: రిటైర్మెంట్ వార్తలపై నటుడు విక్రాంత్ క్లారిటీ
సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి
ఈ సందర్భంగా మూవీ (Shivaji-Laya) నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే పంచాయితీ సెక్రటరీ అయిన శ్రీరామ్ నీతి, నిజాయితీ అంటూ బ్రతుకుతుంటాడు. అయితే అతడి జీవితంలోకి అనుకోకుండా వచ్చిన సంఘటనలు ఏంటి అతడిని పోలీసులు, రౌడీలు ఎందుకు వెతుకుతుంటారు అనేది ఈ సినిమా కథ. క్రైమ్ కామెడీగా ఈ చిత్రం రాబోతుంది. ఒకప్పుడు వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న శివాజీ, లయ ఇందులో మళ్లీ జంటగా నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com