నటి పూనమ్ కౌర్ (Poonam kaur) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. రెండు దశాబ్దాల క్రితం ‘మాయాజాలం’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అడపాదడపా చిత్రాల్లో నటించింది. కానీ సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ, సినీ రాజకీయ సామాజిక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. పరోక్షంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుంది. లేటెస్టుగా పూనమ్ (Poonam kaur) పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
Read Also: Samantha- Raj Nidimoru: పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన సమంత
ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది
సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం ఆమె పేర్కొన్నారు. పూర్తిగా స్వార్థపరమైన మహిళను.. పెయిడ్ పీఆర్ ప్రచారాలతో గొప్పవారిగా చూపిస్తున్నారని ఆమె ఎక్స్లోని పోస్ట్లో రాసుకొచ్చారు. డబ్బుతో బలహీనమైన, నిరాశలో ఉన్న పురుషులను సులభంగా కొనేసుకోవచ్చు అంటూ ఆమె సంచలన కామెంట్ చేశారు. సమంత రెండో వివాహం చేసుకున్న రోజున పూనమ్ చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: