ప్రముఖ నటి సమంత,(Samantha) దర్శకుడు రాజ్ నిడిమోరును(Raj Nidimoru) పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ వివాహం కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో, ఎంతో నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకలో కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి విషయంలో ముందుగా ఎలాంటి వార్తలు లభించలేదు, కానీ అది సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయింది. సమంత మరియు రాజ్ నిడిమోరు పెళ్లి జరిగిన ఈ రోజు, సమంత మాజీ భర్త నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల వివాహ వార్షికోత్సవానికి (డిసెంబర్ 4) కేవలం మూడు రోజుల ముందు జరిగింది.
Read also: సుమ తనయుడు రోషన్ కనకాల చిత్రం ‘మోగ్లీ 2025’ విడుదల
సమంత పెళ్లి రోజున నాగచైతన్య పోస్ట్ పై నెటిజన్ల ఆసక్తికర స్పందనలు
ఇంకా ఆసక్తికరంగా, సమంత(Samantha) పెళ్లి వార్త బయటకు వచ్చిన సమయంలో నాగచైతన్య తన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ “దూత” గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో నాగచైతన్య, “ఒక నటుడిగా సృజనాత్మకత, నిజాయతీతో ఒక ప్రాజెక్ట్ ఎంచుకుని, మన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ప్రజలు దానికి కనెక్ట్ అవుతారని ‘దూత’ నిరూపించింది. వారు ఆ ఎనర్జీని స్వీకరించి, తిరిగి మనకు అందిస్తారు. ‘దూత’ విడుదలై రెండేళ్లు పూర్తయ్యాయి. దీనిని సాధ్యం చేసిన టీమ్కు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. అయితే, నాగచైతన్య చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు వివిధ రీతుల్లో స్పందిస్తున్నారు. సమంత పెళ్లి రోజే ఇలాంటి పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఏమిటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల నాటి వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నారు? అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: