యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ ‘కిష్కింధపురి’ ప్రస్తుతం సినీ వర్గాల్లో మంచి చర్చకు దారి తీస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గ తేజ్) (Sai Druga Tej) సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశారు. సాధారణంగా హారర్ సినిమాలు చూడటానికి ఇష్టపడనని ఆయన చెప్పినా, ఈ సినిమా మాత్రం తన మనసును గెలుచుకుందని పేర్కొన్నారు.
సాయి ధరమ్ తేజ్ తన అభిప్రాయంలో, “కిష్కింధపురి (Kishkindhapuri movie) చాలా అద్భుతంగా తెరకెక్కింది. మొదటి నుంచి చివరి వరకూ సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేసింది. నేను సాధారణంగా ఇలాంటి జానర్ సినిమాలకు దూరంగా ఉంటాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చాలా గొప్ప అనుభూతి కలిగింది” అని వివరించారు.
చిత్ర బృందాన్ని కూడా అభినందించారు
ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందాన్ని కూడా అభినందించారు. ముఖ్యంగా హీరో బెల్లంకొండ (Hero Bellamkonda Srinivas) శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. “శ్రీనివాస్ తన పాత్రలో అద్భుతంగా నిండిపోయాడు. అతని నటనలోని నమ్మకం, ఎనర్జీ తెరపై స్పష్టంగా కనిపించాయి. అలాగే అనుపమ తన సహజమైన అభినయంతో కథకు కొత్త హైలైట్గా నిలిచింది. వారి కృషికి నేను సెల్యూట్ చేస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.
ఇంతటి విభిన్నమైన కథను ఎంచుకుని ప్రోత్సహించినందుకు దర్శకుడు కౌశిక్కు, నిర్మాత సాహు గారపాటికి హ్యాట్సాఫ్ చెప్పారు. ముఖ్యంగా సినిమాలోని సౌండ్ డిజైన్ గురించి ప్రస్తావిస్తూ, అది సినిమాటిక్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు. తెలుగు సినిమాలో ఇది నిజంగా ఒక మంచి హారర్ రైడ్ (Horror Ride) అని, సినిమా చూస్తున్నంత సేపు ఎంతో ఆసక్తిగా అనిపించిందని సాయి తేజ్ వివరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో ‘కిష్కింధపురి’ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: