దేశవ్యాప్తంగా ‘నేషనల్ క్రష్’గా పేరుగాంచిన, బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna), వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ, తన ప్రత్యేక నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన రష్మిక ఇప్పుడు కొరియన్ డ్రామాలు (K-Dramas) పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Bigg Boss 9: సాయి శ్రీనివాస్ ఎలిమినేట్
నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా
కొరియన్ డ్రామాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, కానీ ఆ ప్రాజెక్ట్ తనకు పూర్తిగా నచ్చాలని స్పష్టం చేశారు. ఎందుకంటే తెరపై కనిపించే పాత్రల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానని మీకు తెలుసు కదా,” అని రష్మిక తెలిపారు. కోవిడ్ (Covid) లాక్డౌన్ సమయంలోనే తనకు కే-డ్రామాలపై ఆసక్తి పెరిగిందని,

ఒక్కో సిరీస్లో 16 ఎపిసోడ్లు ఉండటంతో వాటిని చూసేందుకు చాలా సమయం దొరికిందని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, రష్మిక (Rashmika Mandanna)ఇటీవల ‘తమ్మా’ అనే హారర్-కామెడీ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు.
ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ‘భేడియా’, ‘స్త్రీ’, ‘ముంజ్యా’ వంటి హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా వచ్చింది. ఇందులో రష్మిక వాంపైర్ (రక్త పిశాచి) పాత్రలో కనిపించి మెప్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: