సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో విడుదలైన ‘వ్యూహం’ సినిమాకు సంబంధించిన వివాదంలో వర్మపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో, వర్మ ఈరోజు ఒంగోలు పోలీస్ స్టేషన్ విచారణకు హాజరవుతారా? అన్నదే ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.
వివాదానికి కారణమైన మార్ఫింగ్ ఫొటోలు
విడుదలైన వ్యూహం సినిమా ప్రమోషన్ (movie promotion)సమయంలో వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో రాష్ట్ర రాజకీయ నాయకులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ల మార్ఫింగ్ ఫోటోల(Morphing photos)ను షేర్ చేశారు. వీటికి తోడు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది.
హైకోర్టు బెయిల్ – విచారణకు హాజరు కావాల్సిన షరతు
వర్మ (Ram Gopal Varma)ఈ కేసులో హైకోర్టులో బెయిల్ పొందారు. అయితే, పోలీసులు జరిపే విచారణకు తప్పకుండా హాజరుకావాలని న్యాయస్థానం షరతు విధించింది. ఈ నేపథ్యంలో, వర్మ గత ఫిబ్రవరిలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు.
పోలీసుల రెండోసారి నోటీసు – వర్మ హాజరు కానున్నారా?
జులై 22న పోలీసులు వర్మకు మరోసారి నోటీసులు పంపారు. ఆ నోటీసులపై స్పందించిన వర్మ, ఆగస్టు 12న విచారణకు హాజరవుతానని చెప్పారు. దీంతో పోలీసులు వర్మ హాజరయ్యే క్రమంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ, ఆయన వాస్తవంగా హాజరవుతారా? లేదా ఎప్పటిలాగే చివరి నిమిషంలో మళ్లీ డుమ్మా కొడతారా? అనే ప్రశ్న ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: