Purnanavi Bhupalam: తెలుగు సినీ నటి పునర్నవి భూపాలం తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ భామ, తన అమాయకత్వం, సహజమైన నటనతో మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించింది. పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం సినిమాలకు దూరమైంది. ఈ సమయంలోనే బుల్లితెరపై ‘బిగ్ బాస్ తెలుగు’లో పాల్గొని మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆమె, ఆ తర్వాత నటనకు విరామం ఇచ్చి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లారు. అక్కడ సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేసి ఇటీవలే తిరిగి వచ్చి, తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించారు.
Read Also : Eid Mubarak: అభిమానులకు ఈద్ విషెస్ తెలిపిన సినీ ప్రముఖులు
హేమంత్ వర్మతో పునర్నవి ఏడడుగులు
ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన హేమంత్ వర్మతో తన ప్రేమ విషయాన్ని గతేడాది అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తాజాగా మార్చి 20న ఎలాంటి హడావుడి లేకుండా హేమంత్ వర్మను వివాహం చేసుకుంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక ప్రైవేట్గా జరిగింది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్గా జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నపునర్నవి ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భవిష్యత్తులో ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :