రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi)– యాక్షన్, భావోద్వేగాల కలయికలో ఓ గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi) చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా, ఈ చిత్ర బృందం ఓ కీలకమైన, ఉత్కంఠభరితమైన నైట్ యాక్షన్ సీక్వెన్స్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఘట్టాన్ని సహజమైన, కళ్ళు తిప్పలేని లైటింగ్ శైలితోపాటు వైవిధ్యభరితమైన విజువల్స్తో తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ యాక్షన్ ఎపిసోడ్ను తన కెమెరా కంటితో అద్భుతంగా బంధించారు. ‘‘ఇది గ్రిట్టీ విజువల్స్తో కూడిన అద్భుతమైన సీక్వెన్స్’’ అని ఆయన పేర్కొనడం విశేషం. రామ్ చరణ్ తన నటన, అంకితభావంతో సెట్స్లో నిప్పులు చెరిగేలా పనిచేశారని ఆయన ప్రశంసించారు.
ట్రైన్ ఎపిసోడ్తో భారీ అంచనాలు – భారతీయ యాక్షన్ సినిమాకు నూతన ప్రమాణాలు
కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా కోసం భారతీయ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా ఒక భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ కోసం ప్రఖ్యాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అత్యంత శ్రద్ధతో సెట్ను రూపొందించారని, ఇది భారతీయ సినిమా యాక్షన్ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జూన్ 19 వరకు చిత్రీకరించిన ఈ సన్నివేశాల్లో రామ్ చరణ్ పలు సాహసోపేతమైన, ప్రమాదకరమైన స్టంట్స్ చేశారని తెలిసింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు ‘పుష్ప 2’ ఫేమ్, అలాగే క్రికెట్ షాట్తో పేరుగాంచిన నబకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
పాత్రలో జీవిస్తూ చరణ్ నాటకీయతకు నూతన అర్ధం
దర్శకుడు బుచ్చిబాబు సానా సృష్టిస్తున్న విభిన్నమైన కథా ప్రపంచంలో రామ్ చరణ్ పూర్తిగా లీనమయ్యాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా, భావోద్వేగాలు, సామాజిక అంశాలు, మానవ సంబంధాల ఆధారంగా రూపొందిన ఈ కథ రామ్ చరణ్ ను ఒక కొత్త కోణంలో చూపనుందనే విషయం స్పష్టమవుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్కు జాతీయ స్థాయిలో విశేష స్పందన లభించింది.
భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ తో ‘పెద్ది’ ఓ పాన్-ఇండియా విజన్
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి విలక్షణ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ను ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ భుజాన వేసుకున్నాడు. ఎడిటింగ్ బాధ్యతలు జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి నిర్వహించనుండగా, ప్రొడక్షన్ డిజైన్ను మళ్లీ అవినాష్ కొల్లానే చూస్తున్నారు.
మార్చి 27, 2026 – రామ్ చరణ్ పుట్టినరోజున ‘పెద్ది’ గ్రాండ్ విడుదల
ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తోంది. అంచనాలను దాటి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం అన్ని విభాగాల్లోనూ అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. క్రికెట్ నేపథ్యంగా ఉన్నా, ఇది కేవలం క్రీడా కథ కాదు. ఇందులో ప్రతీ సన్నివేశం, ప్రతీ పాత్ర, ప్రతీ భావోద్వేగం ప్రేక్షకులకు గుండెను తాకేలా తయారవుతుందని సమాచారం.
Read also: Kannappa: అమెరికాలో ‘కన్నప్ప’ హాల్ చల్.. బుకింగ్స్ ఓపెన్