Peddi Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతుండగా, తాజాగా మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్ను పంచుకున్నారు. ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో కూడిన డాల్బీ సినిమాస్ (Dolby Cinemas) ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల ప్రేక్షకులకు వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ ,ఆడియో అనుభవం కలగనుంది. భారతీయ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న తరుణంలో, ‘పెద్ది’ని ఇలాంటి అత్యాధునిక హంగులతో తీసుకురావడం విశేషం.
Read Also: Allu Cinemas Multiplex: కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం
ఈ పాన్-ఇండియా చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ అభిమానులతో పాటు సినీప్రియులు కూడా ఈ చిత్రాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్ సీజన్లో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘పెద్ది’తో రామ్ చరణ్ మరోసారి పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
భారీ తారాగణం.. ఏఆర్ రెహమాన్ సంగీతం
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి ఉద్ధండులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామాతో కూడిన ఈ చిత్రాన్ని డాల్బీ టెక్నాలజీలో చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: