జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆయనకు వైరల్ జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఈ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని పార్టీ (Janasena party) అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై వైద్యులు గట్టిగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
జ్వరంతోనే సోమవారం రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిపింది. అలాగే అధికారులతో సమీక్షలు నిర్వహించారని వెల్లడించింది. సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగిందని.
వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని
ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైరల్ ఫీవర్ (Viral fever) తో బాధపడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ జ్వరంతో ఇబ్బందిపడుతూనే శాఖాపరమైన విషయాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారని జనసేన పార్టీ వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: