Delhi High Court: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు మరియు ఈ-కామర్స్ వెబ్సైట్లలో తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే విధంగా అనుచిత కంటెంట్ ప్రచారంలోకి వస్తోందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులను తక్షణమే తొలగించాలని, వాటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
Read Also: Akhanda 2: ‘అఖండ 2’ మూవీ రివ్యూ
పిటిషన్ పరిశీలించిన హైకోర్టు, పవన్ కల్యాణ్ అభ్యంతరంగా భావిస్తున్న లింకులను రెండు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. అలాగే, ఆయా లింకులను ఏడు రోజుల్లోగా తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా(Social media) సంస్థలకు దిశానిర్దేశం జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది.
ఇలాంటి పిటిషన్ దాఖలు చేసిన ఇతరులు
ఈ తరహా సమస్యలపై గతంలో పలువురు సినీ ప్రముఖులు కూడా కోర్టు ద్వారం తట్టారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, శిల్పా శెట్టి, కరణ్ జోహార్, అనిల్ కపూర్తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ మరియు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: