మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’ త్వరలో ఓటీటీలో (OTT) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ ZEE5 ఈ చిత్రాన్ని తమ వేదికపై స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకపోయినా, తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
Read Also: TG: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

అతిథి పాత్ర
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడతోపాటు మరాఠి, బంగ్లా భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.ఈ మూవీలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటించారు.
చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: